Thursday, 12 September 2019

12075 ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2019 నోటిఫికేషన్ విడుదల: తెలంగాణకు 612 పోస్టులు


ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబిపిఎస్) క్లరికల్ కేడర్ పోస్టుల కోసం ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లర్క్ నోటిఫికేషన్ నియామకం కోసం కామన్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ibps తన  అధికారిక వెబ్‌సైట్‌లో ibps.in లో విడుదల చేసింది .మొత్తం అన్ని రాష్ట్రాల లో కలిపి 12075 పోస్టులు కాగా తెలంగాణా కి 612,ఏపీ కి 777 పోస్టులు ఉన్నాయి.
 ఇందులో పాల్గొనే  బ్యాంకు లలో క్లరికల్ కేడర్ పోస్టుల కోసం సిబ్బందిని ఎంపిక చేయడానికి  నియామక ప్రక్రియ కోసం ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్) తాత్కాలికంగా డిసెంబర్ 2019 మరియు జనవరి 2020 లో షెడ్యూల్ చేయబడింది.
 ముఖ్య మైన తేదీలు: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 9 వరకు
పరీక్ష విధానం:  డిసెంబర్ 7, 8, 14 మరియు 21 ,తేదీలలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తుంది.

ఐబిపిఎస్ రిక్రూట్‌మెంట్ 2019 కాల్ లెటర్ నవంబర్ లో ఫలితాలు విడుదల అవుతాయి.షార్ట్‌లిస్ట్ చేయబడిన  అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరుకావచ్చు.
 జనవరి 19, 2020 న  మెయిన్స్ నిర్వహించబడింది. సెలెక్షన్ తాత్కాలిక కేటాయింపు జాబితాను ఏప్రిల్ 2020 లో విడుదల చేయబడును.

ఆన్‌లైన్ పరీక్ష - ప్రాథమిక : 07.12.2019, 08.12.2019, 
                                        14.12.2019 & 21.12.2019

 ఆన్‌లైన్ పరీక్ష ఫలితాలు : డిసెంబర్ 2019 / జనవరి 2020
 
 ఆన్‌లైన్ ప్రధాన  పరీక్ష కోసం కాల్ లెటర్ డౌన్‌లోడ్ -   పరీక్ష జనవరి 2020
 ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష :- 19.01.2020.

 అర్హత : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ

వయస్సు : కనిష్టంగా : 20 సం"
                 గరిష్టంగా : 28 సం"
                 (01-09-2019 నాటికి)
అప్లికేషన్ ఫీజు : Rs. 100/- for SC/ST/PWBD/EXSM candidates. 
                       - Rs. 600 /-  ఇతరులకు

దరఖాస్తు వెబ్‌సైట్: www.ibps.in


ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2019లో  పాల్గొనే బ్యాంకు లు

అలహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్  మహారాష్ట్ర.

Monday, 12 August 2019

TS Ed.CET-2019 పూర్తి షెడ్యూల్.ప్రకటించిన ఉన్నత విద్యా మండలి


TS Ed.CET-2019 పరీక్ష యొక్క అర్హత గల అభ్యర్థులు సర్టిఫికేట్ ధృవీకరణకు హాజరు కావాలని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

అన్ని అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధృవపత్రాలు:
 1. TS Ed.CET-2019 ర్యాంక్ కార్డ్
 2. TS Ed.CET-2019 హాల్ టికెట్
 3. అర్హత పరీక్ష యొక్క డిగ్రీ సర్టిఫికేట్ మరియు మార్కుల మెమోరాండం
 4. ఇంటర్మీడియట్ మెమో-కమ్ పాస్ సర్టిఫికేట్ లేదా దానికి సమానమైనది
 5. ఎస్‌ఎస్‌సి లేదా దానికి సమానమైన మార్కుల మెమో
 6.  9 వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ వరకు ధృవీకరణ పత్రాలను అధ్యయనం చేయండి
 7. నివాస ధృవీకరణ పత్రం (అభ్యర్థి సంస్థాగతీకరించకుండా ప్రైవేట్ అధ్యయనం చేసిన సందర్భంలో చదువు)
 8. స్థానికేతర అభ్యర్థుల విషయంలో తెలంగాణలో 10 సంవత్సరాల తల్లిదండ్రుల నివాస ధృవీకరణ పత్రం రాష్ట్రం వెలుపల ఉపాధి కాలాన్ని మినహాయించి. ఈ సర్టిఫికేట్ నుండి పొందాలి తాసిల్దార్.
 9. M.R.O జారీ చేసిన తాజా తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం.తెలంగాణ ప్రభుత్వం ద్వారా 01.01.2019 న లేదా తరువాతది.
 10. ఆధార్ కార్డు
 11.  కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం (ఎస్సీ / ఎస్టీ / బిసి విషయంలో).
 12.  PH / CAP / NCC / మైనారిటీ సర్టిఫికేట్ (గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ TC లో పేర్కొనబడింది) సర్టిఫికెట్లు.
 13. జిరాక్స్ స్వీయ ధృవీకరణతో ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల కాపీలు.

టిఎస్ ఎడ్.సెట్ -2019 కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు వెబ్ ఎంపికల కోసం షెడ్యూల్ VENUE:

సర్టిఫికేట్ వెరిఫికేషన్    మెథడాలజీ          వెబ్ ఎంపికల తేదీ
తేదీ
16-08-2019            ఇంగ్లీష్                    17-08-2019 
                                 ఫిజికల్ సైన్స్
17-08-2019            గణితం                   18-08-2019
18-08-2019            గణితం                   19-08-2019
19-08-2019            బయోలాజికల్        20-08-2019
                                 సైన్సెస్
20-08-2019            బయోలాజికల్         21-08-2019
                                 సైన్సెస్
21-08-2019            సోషల్ స్టడీస్           22-08-2019
22-08-2019            సోషల్ స్టడీస్           23-08-2019

ప్రత్యేక వర్గాల ధృవీకరణ ధృవీకరణ కోసం షెడ్యూల్ :

సర్టిఫికేట్ వెరిఫికేషన్      మెథడాలజీ           స్పెషల్ కేటగిరీ
తేదీ
                                    గణితం
16-08-2019               బయోలాజికల్       NCC
                                    సోషల్ స్టడీస్
                                    ఇంగ్లిష్
                                    ఫిజికల్ సైన్స్
17-08-2019               ఆల్ సబ్జెక్ట్స్           CAP
18-08-2019               ఆల్ సబ్జెక్ట్స్           PH

సమయం :9:00 am నుండి 1:00 Pm varaku.

ఫీజు వివరాలు:
సర్టిఫికేట్ ధృవీకరణ సమయంలో చెల్లించాల్సిన ఫీజు:
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 / - మరియు ఇతరులకు రూ. 800 /-

Thursday, 8 August 2019

"భారత రత్న" అవార్డుల ప్రధానం


దేశం లోనే అత్యున్నత పౌర పురస్కారం "భారత రత్న " అవార్డులను రాష్ట్ర పతి   భవన్ లో నిన్న ,ప్రధానం చేశారు.మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ,దివంగత జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలకు ఈ అవార్డును రాష్ట్రపతి శ్రీ. రాం నాథ్ కోవింద్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ,హోమ్ మంత్రి అమిత్ షా  రాజ్ నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.


-నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ ఎకాడెమి ఎగ్జామినేషన్ (II),లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-డిగ్రీ ప్రవేశాలకు "దోస్త్" మరొక అవకాశం
-2020 వ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ల క్యాలెండర్ ని ప్రకటించిన యూపీఎస్సీ

NMC బిల్లుకు ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి




ప్రస్తుతం వైద్య విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వివాదాస్పద  “నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లు” చట్ట రూపం దాల్చింది.గతం లో దీని స్థానంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం (1956) ఉండేది.అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిలో కొన్ని మార్పులు తెచ్చి దాని స్థానం లో NMC బిల్లు ను తీసుకు వచ్చారు.ఈ బిల్లు పై వైద్య విద్యార్థులు ,రెసిడెంట్ వైద్యుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.ఇప్పటికీ దీని పై ఆందోళన కొనసాగుతుంది.అయితే ఈ బిల్ పార్లమెంట్ లో పాస్ అవడం చేత దీనిని రాష్ట్ర పతి వద్దకు పంపగా రాష్ట్రపతి ఈ బిల్లు పై సంతకం చేశారు.దీంతో ఈ బిల్లు ఇక NMC ACT -2019 చలామణి కానుంది.త్వరలోనే ఇది గెజిట్ లో నోటిఫై కానుంది.ఈ చట్టాన్ని విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకోలేదని.కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.త్వరలోనే దీనికి సంబంధించిన నిబంధనలను రూపొందిస్తామని తెలిపారు.  

-నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ ఎకాడెమి ఎగ్జామినేషన్ (II),లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-డిగ్రీ ప్రవేశాలకు "దోస్త్" మరొక అవకాశం
-2020 వ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ల క్యాలెండర్ ని ప్రకటించిన యూపీఎస్సీ


Wednesday, 7 August 2019

నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ ఎకాడెమి ఎగ్జామినేషన్ (II),లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ ఎకాడెమి ఎగ్జామినేషన్ (II),లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.

ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు upsconline.nic.in వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపడానికి సంక్షిప్త సూచనలు ఇవ్వబడ్డాయి..
అర్హత: ఇంటర్ MPC  తో ఇంటర్ పూర్తి చేసిన  విద్యార్థులు

పోస్టులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) లో :
370.  పోస్టులు. (ఆర్మీ 208, నావీ 42,ఏర్ ఫోర్స్ 120)
నావల్ అకాడమీ లో(NA) : 45 పోస్టులు
             
 వయస్సు పరిమితులు, మరియు వైవాహిక స్థితి:
 పెళ్లికాని మగ అభ్యర్థులు మాత్రమే జనవరి 02, 2001 లోపు జన్మించిన మరియు జనవరి 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.  తరువాత వారికి అర్హత లేదు.

ఫీజు: ఎస్సీ/ఎస్టీ లకు ఫీజు లేదు,
          ఇతరులకు 100/- రూపాయలు,

అప్లికేషన్ చివరి తేదీ :
 (i) ఆన్‌లైన్ దరఖాస్తులను 2019 సెప్టెంబర్ 3 వరకు సాయంత్రం 6:00 వరకు నింపవచ్చు.
 (ii) ఆన్‌లైన్ దరఖాస్తులను 10.09.2019 నుండి 17.09.2019 నుండి 6:00 వరకు ఉపసంహరించుకోవచ్చును.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ ఎకాడెమి ఎగ్జామినేషన్ (II), 2019
పూర్తి వివరాలకు
 (కమిషన్ వెబ్‌సైట్ http://upsc.gov.in) సందర్శించండి.
---శివ్

డిగ్రీ ప్రవేశాలకు "దోస్త్" మరొక అవకాశం



డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ మరోక అవకాశం కల్పించింది,
డిగ్రీ ప్రవేశాలు మరోసారి శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది.

విద్యాశాఖ మంత్రి జగదీశ్ గారు అలాగే వివిధ కళాశాలల యాజమాన్య సంఘాలు బుదవారం ప్రతినిధులతో వివిధ సమస్యల పై చర్చలు జరపడం జరిగింది.

ఈ చర్చలలో మరోసారి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి గారు బుదవారం కాల పట్టికను విడుదల చేయడం ఐనది.

అలాగే, మిగిలిన సీట్లకు కూడా స్పాట్ కౌన్సిలింగ్ చేసుకోవడానికి మంత్రి గారు ఆమోదం తెలిపారు.

దోస్త్ టైమ్ టేబుల్ (కాల పట్టిక) :

దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు వెబ్ ఆప్షన్ : ఈ నెల 9 నుండి 13 వరకు,
సీట్ల కేటాయింపు : 14 నుండి ప్రారంభం,
ఆన్ లైన్ లో ఫీజు పేమెంట్ మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ: 14 నుండి 16 వ తేదీ వరకు..

2020 వ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ల క్యాలెండర్ ని ప్రకటించిన యూపీఎస్సీ



యూపీఎస్సీ - దేశం లోని కేంద్ర సర్వీసు లకు సంబంధించిన అత్యున్నతస్థాయి ఉద్యోగాలను భర్తీ చేసే రాజ్యాంగ బద్ద సంస్థ. ప్రతీ సంవత్సరం ఇది విడుదల చేయబోయే ఉద్యోగ సంబంధిత నోటిఫికేషన్ విడుదల తేదీ ,పరీక్ష మరియు ఇతర ముఖ్య తేదీలకు సంబంధించిన క్యాలెండర్ ని ముందుగానే ప్రకటించడం ఆనవాయితీ.దీనివల్ల అభ్యర్థులు ముందు నుండి పరీక్షలకు సిద్ధం అవడానికి అవకాశం ఉంటుంది.
ఈసారి ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం  సివిల్ సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ల  ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన ఉమ్మడి నోటిఫికేషన్ 12.02.2020   రోజున విడుదల కానుంది.ఈ పరీక్ష కు అప్లై చేసుకోవడానికి చివరి  తేదీ 03.03.2020. పరీక్ష తేదీ   31.05.2020 (ఆది వారం ).
అలాగే సివిల్ సర్విస్ మెయిన్స్  పరీక్ష 18.09.2020 (శుక్ర వారం నుండి ) 5 రోజుల పాటు జరుగుతుంది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్  మెయిన్స్ పరీక్ష తేదీ 22.11.2020 (ఆది వారం నుండి ) 10 రోజులు జరుగుతుంది.
 ఇంకా ఇవి కాకుండా C.D.S.(కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ )   NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ ),NA(నావల్ అకాడమి)   IES ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ వంటి ఎన్నో ఇతర పరీక్షల తేదీలు కూడా ఇందులో ఉన్నాయి.

Monday, 5 August 2019

డిగ్రీ అధ్యాపకులకు త్వరలో వారం రోజుల పాటు శిక్షణ


రాష్ట్రం లోని1050  ప్రభుత్వ మరియు  దాదాపు 15000 ప్రైవేట్ డిగ్రీ అధ్యాపకులకు వారం రోజులపాటు శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. మారిన సిలబస్ ,పైన CBCS విధానం పైన,క్రెడిట్ సిస్టం పైనా అవగాహన కల్పించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.ఈ శిక్షణ ఆయా యూనివర్సిటీ లు నిర్వహిస్తాయని ఒక్కొక్క బ్యాచ్ కి సగటుని 30 మంది చొప్పున శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

TS ED.CET -2019 - కౌన్సిలింగ్ తేదీలు ఖరారు.




TS ED.CET -2019  ప్రవేశాల యొక్క మొదటి ప్రవేశ కమిటీ సమావేశం అనేది TSCHE వారి ఆధ్వర్యంలో తేదీ: 30-07-2019 న మధ్యాహ్నం 03:00 గంటల సమయం లో మసాబ్ ట్యాంక్‌ వద్ద జరిగింది,
 ఈ సమావేశానికి  పి.పాపిరెడ్డి చైర్‌పర్సన్ గారు TSCHE కి అధ్యక్షత వహించారు. మరియు ఈ కార్యక్రమానికి కార్యదర్శి TSCHE ప్రవేశాల కన్వీనర్  మరియు ఇతర విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ కళాశాలల యొక్క ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో TS ED.CET - 2019 యొక్క షెడ్యూల్ ని ఖరారు చేయడం జరిగింది.

కౌన్సెలింగ్ నోటిికేషన్ విడుదల తేదీ : 05 ఆగష్టు 2019,
సర్టిఫికేట్ వెరిఫికేషన్ : 13-08-2019 నుండి 20-08-2019,
వెబ్ ఆప్షన్ ప్రక్రియ : 14-08-19 నుండి 22-08-2019,

సర్టిఫికేట్ ధృవీకరణ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు (12) హెల్ప్ లైన్ ల వద్ద జరుగుతుంది.

రిజస్ట్రేషన్ ఫీజు: SC/ST -500/-₹, Others -800/-₹
మరిన్ని పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శంచండి..

వెబ్ సైట్ వివరాలు: http://edcetadm.tsche.ac.in (లేదా)
                            http://edccet.tsche.ac.in
---శివ్.
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం

విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక

కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల



పాత పది జిల్లాల జ్యుడీషియల్ కోర్టు లతో పాటుగా,మెట్రో పాలిటన్ సెషన్ కోర్టు,సిటీ సివిల్ కోర్టు,సిటీ స్మాల్ కేసెస్ కోర్టు, స్పెషల్ జడ్జి ఫర్ ఎకనామిక్ ఎఫెన్స్ (హైదరాబాద్),స్పెషల్ జడ్జి ఫర్  ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్,స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ ఆఫ్ కేసెస్ కోర్టు లో ఖాళీలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 1539

విభాగాలు : స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-3)-54, జూనియర్ అసిస్టెంట్ - 277, టైపిస్ట్-146, ప్రాసెస్ సర్వర్ -127, ఎగ్జామినర్ -57, కాపీయిస్ట్ -122, ఫీల్డ్ అసిస్టెంట్-65, రికార్డ్ అసిస్టెంట్ -5,ఆఫీస్ సబార్డినేట్- 686.

అర్హత : పోస్టులను అనుసరించి వాటి యొక్క అర్హత అనేది నిర్ణయించబడింది.వాటి యొక్క వివరాలు ఆధారిత వెబ్ సైట్ లో ఇవ్వడం జరిగింది.

వయస్సు: 18 నుండి 34 సంవత్సరాలు 1 జూలై 2019 నాటికి కలిగి ఉండవలెను.

వయో పరిమితి : ఎస్సీ/ఎస్టీ/బీసీ లకు 5 సంవత్సరాలు,
                         PHC  లకు 10 సంవత్సరాలు.
ఫీజు : ఎస్సీ/ఎస్టీ లకు 400/-, ఇతరులకు 800/-

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం మరియు చివరి తేదీ : ఆన్ లైన్ ద్వారా, సెప్టెంబర్ 4 వరకు.

వెబ్ సైట్ యొక్క వివరాలు : https://hc.ts.nic.in
---శివ్.
TS ED.CET -2019 - కౌన్సిలింగ్ తేదీలు ఖరారు.
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం

విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక

పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం


భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఆదివారం భూమి యొక్క మొదటి చిత్రాలను చంద్రయాన్ 2 పంపడం జరిగింది,

ఉపగ్రహం భూమికి సంబంధించిన కొన్ని ఫొటోలను తీసి వాటిని ఇస్రోకు పంపించింది. ఇస్రో ఛైర్మన్ కె శివన్ ఆదివారం వాటిని విడుదల చేశారు. ప్రస్తుతం భూ కక్ష్యలో ప్రయాణిస్తోంది చంద్రయాన్‌-2.

భూ ఉపరితలానికి అయిదువేల కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రయన్ 2 ఈ ఫొటోలను తీసింది. శనివారం సాయంత్రం 5:28 నుంచి 5:37 నిమిషాల మధ్య భూమిని క్లిక్ మనిపించింది.

ఇది దేశం యొక్క రెండవ మూన్ మిషన్, ఇది పక్షం రోజుల క్రితం ప్రారంభించబడింది.

ఈ చిత్రాలను శనివారం చంద్రయాన్ 2 బోర్డులో ఎల్ -14 కెమెరా బంధించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ట్విట్టర్‌లో ప్రకటించడం జరిగింది.

జూలై 22 న ప్రారంభించిన భారతదేశం యొక్క రెండవ మూన్ మిషన్, రోవర్ ల్యాండింగ్ ద్వారా అపరిచిత చంద్ర దక్షిణ ధృవాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తోందని, కాగా
ఆర్బిటర్, ల్యాండర్ మరియు రోవర్లతో కూడిన చంద్రయాన్ -2 యొక్క ల్యాండింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో జరగనుంది.
---శివ్.
TS ED.CET -2019 - కౌన్సిలింగ్ తేదీలు ఖరారు.
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక

Sunday, 4 August 2019

విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం


TS :బీసీ,ఈబీసీ వర్గానికి చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను చదవడానికి ఉద్దేశించిన మహాత్మా జ్యోతిబాపులే విదేశీ విద్యా నిధి పథకానికి ప్రభుత్వం దరఖాస్తుల ద్వారా ఆహ్వానం అందిస్తుంది.

ఆన్ లైన్ దరఖాస్తు : 31.08.19 సాయంత్రం 5 గంటల వరకు.

అర్హత : ఏదైనా డిగ్రీ లో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి.

వార్షిక ఆదాయం : 5 లక్షల లోపు ఉండాలి

విదేశీ విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ లెటర్ తప్పక కలిగి ఉండాలి.

అధీకృత వెబ్ సైట్ :https://telanganaepass.cgg.gov.in
లో దరఖాస్తు చేసుకోవచ్చు
--శివ్
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం


APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక

Saturday, 3 August 2019

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)


 ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:
 02.08.2019 నుండి 17.08.2019 వరకు

అభ్యర్థులకు కాల్ లెటరు డౌన్‌లోడ్ చేయడానికి: 25.08.2019 నుండి 31.08.2019 వరకు

అర్హత : ఎలక్ట్రికల్ డొమెస్టిక్ ఉపకరణాలలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్‌మాన్ ట్రేడ్ లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో గుర్తింపు పొందిన బోర్డు మరియు ఐటిఐ అర్హత నుండి అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి / 10 వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తుదారుల వయో పరిమితి 01.07.2019 నాటికి,
ఈ క్రింది విధంగా ఉండాలి.
కనిష్ట: 18 సంవత్సరాలు.
గరిష్టంగా: 35 సంవత్సరాలు.
అప్లికేషన్ ఫీజు :  రూ. 200 / -.

ఎంపిక ప్రక్రియ :
రాతపరీక్ష,
ఇంటర్వ్యూ,
పత్ర ధృవీకరణ.

మొత్తం ఖాళీల సంఖ్య: 5107 పోస్టులు

తేదీ : 02-08-19.

పూర్తి వివరాలకు సందర్శించండి అధికారిక పోర్టల్‌- www.apspdcl.in

--శివ్.
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం

విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక

Friday, 2 August 2019

IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల



 బ్యాంక్ లలో ప్రొబేషనరీ అధికారుల నియామకానికి సాధారణ నియామక ప్రక్రియ నోటిఫికేషన్ ను IBPS విడుదల చేసింది.
ఆన్‌లైన్ నమోదు మరియు వివరాలు
 తేది- 07.08.19 నుండి 28.08.19 వరకు.
అప్లికేషన్ ఫీ పేమెంట్ (ఆన్ లైన్) :
07.08.19 నుండి 28.08.19 వరకు.
వయస్సు : కనిష్టంగా 20,గరిష్టంగా 30 సంవత్సరాలు.
అర్హత : డిగ్రీ (గ్రాడ్యుయేట్) :  UGC/ప్రభుత్వం చేత గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి.
అప్లికేషన్ ఫీజు: 100 /- SC/ST/PWBD,
                         600 /- For all others
ఎంపిక విధానం :
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

భాగస్వామ్య సంస్థలు:
అలహాబాద్ బ్యాంక్,
కెనరా బ్యాంక్,
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,
 సిండికేట్ బ్యాంక్,
ఆంధ్ర బ్యాంక్,
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్,
యుకో బ్యాంక్,
బ్యాంక్ ఆఫ్ బరోడా,
కార్పొరేషన్ బ్యాంక్,
పంజాబ్ నేషనల్ బ్యాంక్,
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఇండియన్ బ్యాంక్,
పంజాబ్ & సింధ్ బ్యాంక్,
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
పోస్టులు :
SC -670,
ST-299,
OBC-904,
EWS-432,
UR -2031
 మొత్తం :4336.

మరిన్ని వివరాలకు అధీకృత వెబ్‌సైట్ : www.ibps.in ను సందర్శించాలి.
--శివ్.

NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక


ఆసియా నోబెల్ గా భావించి బడే రామన్ మెగసెసే అవార్డు 2019 భారత జర్నలిస్ట్ శ్రీ రవీష్ కుమార్ కి దక్కింది.'NDTV ఇండియా'లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్న రవీష్ కుమార్, సామాన్యుల వాస్తవిక జీవితాలపై ఈ ఛానల్ లో ప్రైమ్ టైం లో నిర్వహిస్తున్న షో ఎంతో ఆదరణ పొందింది.గొంతుక లేని వారికి ప్రజావాణి గా మార్చడమే విలేకరి విధి అని ఈ బాధ్యతను శ్రీ రవీష్ కుమార్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అవార్డు కమిటీ కొనియాడింది.
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరు మీద ఇస్తున్న ఈ అవార్డు కు 2019 సంవత్సర కాలానికి ఐదుగురిని ఎంపిక చేశారు.వీరిలో కో స్వె విన్(మయన్మార్), ఆంగ్ ఖానా నీల పాయిజిత్(థాయిలాండ్),రెముండా పుజాంతే(ఫిలిప్పీన్స్) కిమ్ జోంగ్ కి(దక్షిణ ఆఫ్రికా) లు ఉన్నారు.


TS ED.CET -2019 - కౌన్సిలింగ్ తేదీలు ఖరారు.
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం

విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

Thursday, 1 August 2019

మరోసారి దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ లు:ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్ లు కూడా..


2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 4 సార్లు 'దోస్త్' విధానం లో ఆన్ లైన్ అడ్మిషన్ ల ప్రక్రియ జరిగింది.నీటితో 4 వ దఫా అడ్మిషన్ ల ప్రక్రియ పూర్తి కానుంది. 5,6 తేదీ లలో గ్రూప్ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.ఇక తర్వాత 5 వ సారి దోస్త్ అడ్మిషన్ లకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.అది పూర్తి కాగానే స్పాట్ అడ్మిషన్ లు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.

ఫస్ట్ అటెంప్ట్ లొనే సివిల్స్ క్లియర్ చేయాలంటే ఏం చేయాలి..??


 సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మొదటి ప్రయత్నం లొనే విజయం సాధించాలి అంటే ఏం చేయాలో తెలుసు కోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో "unacademy"వారి వీడియో ..presented by Siddharth Arora

Monday, 29 July 2019

తెలంగాణ లో మరియు దేశంలో పెరిగిన పెద్ద పులుల సంఖ్య:2018 పులుల సెన్సస్ రిపోర్ట్ -*కరెంట్ ఎఫైర్స్*


2018 టైగర్ సెన్సస్ రిపోర్ట్ ను ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ మరియు కేంద్ర పర్యావరణ -అటవీ శాఖలు సంయుక్తంగా పులుల సంఖ్యను లెక్కించాయి.2006 నుండి ప్రతీ  నాలుగేళ్లకోకసారి ఈ లెక్కింపు జరుపుతున్నారు.
దీని ప్రకారం దేశంలో పులుల సంఖ్యలో 33 శాతం పెరుగుదల కనిపించింది. 2014 లో లెక్కించిన లెక్కల ప్రకారం 2,226 నుండి 2,967 కి పెరిగినట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలిసింది.
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మధ్య ప్రదేశ్ గరిష్టంగ 526 ,పులులను కల్గి ఉండగా , కర్ణాటక 524 పులా సంఖ్యతో రెండో స్థానం లో నిలిచింది. మిజోరాం,చత్తిస్ గడ్ లలో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల లో పులుల సంఖ్య  పెరిగినట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 లో 68 పులులు ఉండగా ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కల్సి 74  పులులు ఉన్నాయి.
2014 లో తెలంగాణా లో 20 పులులు (అమ్రాబాద్ 17, కవ్వాల్ 3) ప్రస్తుతంతెలంగాణా లో 26 పులులు (అమ్రాబాద్ 14, కవ్వాల్ లో 12 ) ఉన్నట్లు గా తేలింది.
 ఆంధ్రప్రదేశ్ లో 48 పులులు ఉన్నాయి.తెలంగాణా లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్,కవ్వాల్ టైగర్ రిజర్వ్ ల లో పులులు సంరక్షించ బడుతున్నాయి.
ఏది ఏమైనా దేశం లోని అన్ని రాష్ట్రాల కృషి వల్ల పులి వంటి వన్య ప్రాణుల సంఖ్య పెరగడం మనిషికి ప్రకృతి సంరక్షణ పై కొంత సానుకూల దృక్పథం ఏర్పడిందని చెప్ప వచ్చు.

CAT (కామన్ అడ్మిషన్ టెస్ట్)-2019 విడుదల :పూర్తి వివరాలు



దేశం లోని ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్  మేనేజ్ మెంట్(ఐఐఎం) లు కూడా ముఖ్య మైనవి.ప్రస్తుతం దేశం లో మొత్తం 20  ఐఐఎం లు ఉన్నాయి.వీటిలో ప్రవేశానికి ప్రతి సంవత్సరం కామన్ అడ్మిషన్ టెస్ట్ (Common Admission Test) ఇవి నిర్వహిస్తాయి. ఇందులో ర్యాంక్ ను బట్టి ఆయా ఐఐఎం లలో  వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లు మరియు ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్ లు పొందవచ్చు.అంతే కాదు దేశం లోని కొన్ని నాన్ ఐఐఎం సెంటర్ లలో కూడా అడ్మిషన్ పొందడానికి CAT స్కోరు ను పరిగణలోకి తీసుకుంటారు.ఐఐఎం లలో చదివినవారికి అద్భుతమైన ప్లేస్ మెంట్లు మంచి వేతనాలు గల ఉద్యోగాలు జాతీయ అంతర్జాతీయ కంపనీలలో లభిస్తాయి.నిన్న అంటే జూలై 28, 2019 రోజున CAT-2019 నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు :

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ :.August 07, 2019(10.00AM) రోజున ఈ పరీక్షకు సంబంధించిన

రిజిస్ట్రేషన్ గడువు ముగింపు: September 18(5.00 PM) 2019 రోజున

హాల్ టికెట్ డౌన్ లోడ్ గడువు: అక్టోబర్ 23 నుండి నవంబర్ 24 వరకు.

పరీక్ష తేదీ:  నవంబర్ 24 , 2019 న 

రిజల్ట్ : జనవరి ,2020 రెండవ వారం   

అర్హత : యూజీసీ చేత గుర్తింపబడిన ఏదైనా యునివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.
             జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి.
             SC ,ST మరియు వికలాంగ అభ్యర్థులు 45 % మార్కులతో పాస్ అయి ఉండాలి.
            ఇప్పుడు CBCS విధానం కావున అభ్యర్థులు ఆయా యునివర్సిటీ ఇచ్చిన CGPA ను శాతం లోకి
            మార్చి  రిగణిస్తారు.
రిజర్వేషన్:   ఐఐఎం లలో సీట్ల కేటాయింపు క్రింది  రిజర్వేషన్ ల ఆధారంగా జరుగుతుంది.
                     15% -SC అభ్యర్థులకు

                     7.5% ST- అభ్యర్థులకు

                     27% -ఇతర వెనుక బడిన (Other Backward Classes )“non-creamy” layer (NC-OBC)
                     అభ్యర్థులకు

                     10%  ఆర్థికంగా బలహీన వర్గాల (Economically Weaker Sections-EWS) అభ్యర్థులకు.
పరీక్ష విధానం :  కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ఫీజు : SC, ST అభ్యర్థులకు & వికలాంగ అభ్యర్థులకు 950 రూపాయలు
           ఇతరులు అందరికీ 1900 రూపాయలు.

నోట్ : ఒక అభ్యర్థి అన్ని ఐఐఎం లకి ఒక్కసారి ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


పరీక్షా కేంద్రాలు : దేశం లోని గుర్తింపు పొందిన 156 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడును.

దేశం లోని ఐఐఎం లు: అవి ఆఫర్ చేసే కోర్సులు

      మరిన్ని వివరాలకు CAT website: www.iimcat.ac.in  సందర్శించగలరు.


Sunday, 28 July 2019

ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన మేరీ కోమ్


ఆరు సార్లు ప్రపంచ  బాక్సింగ్ ఛాంపియన్ భారత బాక్సర్ మేరీ కోమ్ ఇండోనేసియా లో జరుగుతున్న ప్రెసిడెంట్ కప్ టోర్నీ ఫైనల్ లో ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఏప్రిల్ పై ఘన విజయం సాధించింది.51 కేజీ ల విభాగం లో జరిగిన ఈ పోటీలో సెమీ ఫైనల్లో వియత్నాం బాక్సర్ అన్ హ్ వో కిమ్ పై 3-2 తో చెమటోడ్చి నెగ్గగా ఫైనల్లో సులువుగా నెగ్గింది.కాగా సెప్టెంబర్ నెలలో రష్యా లో  జరుగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ కి మేరీ సిద్ధమవుతోంది.

Friday, 26 July 2019

త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సొంత గృహాలు..!


త్వరలొనే ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నెరవేరనుంది.ముఖ్యంగా పట్టణాల్లోని దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హైదరాబాద్ లోని పోచారం ,బండ్ల గూడ ల లోని 3200 అపార్టుమెంట్ ఫ్లాట్ లను రాష్ట్ర ప్రభుత్వం  కేటాయించనుంది."ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్" పద్దతిలో ఈ ఫ్లాట్ లను  సుమారు 23 నుండి 30 లక్షల ధరతో విక్రయించనున్నట్లు సమాచారం. అయతేి మునిసిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నందు వల్ల ,ఎలక్షన్స్ అయ్యాక ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.2016 లో జీవో నెంబర్ 201 ద్వారా అప్పటి సీఎస్ ఆద్వర్యంలో రాజీవ్ గృహకల్ప సంస్థ ద్వారా,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బండ్లగూడ, పోచారం ల లో 3710 ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టారు.కాగా ఇందులో సింగిల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ అన్నీ అమ్ముడు పోగా 3200 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లు మిగిలాయి.వీటిని ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23 లక్షల నుండి 30 లక్షల ధరలో అమ్మనున్నారు.అయితే ఈ డబ్బు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా చెల్లించ వచ్చు మరియు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వారు బ్యాంక్ లోన్ పొందటం లో ఉద్యోగుల కు సహాయం చేస్తుంది.వీటిలో ఫినిష్డ్, సెమీ ఫినిష్డ్ రకాలు ఉన్నాయి.

Sunday, 21 July 2019

త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5% DA పెంచనున్న కేంద్రం.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు 5 శాతం DA పెంచ బోతున్నట్లు తెలిసింది. ఈ పెంపు కు సంబంధించిన జీవో సెప్టెంబర్ నెల లో రాబోతుంది.    ఇది ఈ జులై 1 వ తేదీ నుండి వర్తించ బోతుంది.దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DA 12 శాతం నుండి 17 కు చేరుకుంటుంది.సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రతీ 6 నెలల కు కరువు భత్యాన్ని పెంచుతుంది.గత సెప్టెంబర్ నెల లో 7 శాతం  DA కు అదనంగా 2 శాతం పెంచడం తో అది 9 శాతం  కాగా తర్వాత 3 శాతం పెంపుతో 12 శాతం అయ్యింది.ఇది జనవరి  1 ,2019 నుండి అమలు లోకి వచ్చింది.ఇప్పుడు పెంచ బోయే DA 5శాతం గా ఉంటుందని తెలుస్తుంది. అలా జరిగితే 2016 నుండి ఇదే అతి పెద్ద పెంపు అవుతుంది.

మరిన్ని updates కోసం visit చేయండి ప్రతిరోజు
www.paatshaalaindia.blogspot.com

నెట్,సెట్, పీహెచ్ డీ అభ్యర్థులకు శుభవార్త:దేశం లోని అన్ని యూనివర్సిటీ లలో సుమారు 6910 అధ్యాపక పోస్టుల భర్తీ కి కేంద్రం ఆదేశం.


ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీ లలో అధ్యాపకుల పోస్టుల భర్తీ జరగక ఆశావహులు.   నెట్,సెట్ పీహెచ్ డీ     క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే యూనివర్సిటీ లలో రిజర్వేషన్ ల పై క్లారిటీ రావడం తో సుమారు 6910 పోస్టుల ను వెంటనే భర్తీ చేయాలని ,      జులై చివరి వారం లో నోటిఫికేషన్ విడుదల చేయాలని       6 నెల ల లోపు ఈ భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్సిటీ లను ఆదేశించింది.ఇప్పటికే JNU ఢిల్లీ ,అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయగా కొన్ని ఇతర యూనివర్సిటీ లు కూడా నోటిఫికేషన్ లు విడుదల చేశాయి.కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  లో సుమారు 123 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ , ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు యూనివర్సిటీ వీసీ అప్పారావు తెలిపారు.కాబట్టి అర్హులైన అందరు దేశ వ్యాప్తంగా ఈ పోస్టుల పరీక్ష కు ఇప్పటి నుండే ప్రిపేర్ అయితే మంచిది.
మరిన్ని updates కోసం visit చేయండి ప్రతిరోజు
www.paatshaalaindia.blogspot.com