దేశ రక్షణ కు ,ప్రకృతి విపత్తుల నివారణకు, అటవీ, వ్యవసాయ రంగాల్లో ఉపయోగపడే ఉపగ్రహం రీశాట్-2బీఆర్1 ను నిన్న 5.30 గంటలకు PSLV-C46 వాహక నౌక ద్వారా ఏపీ లోని నెల్లూరు జిల్లా లోని శ్రీహరి కోట నుండి ఇస్రో విజయవంతం గా ప్రవేశ పెట్టింది. శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రవేశ పెట్టారు. ఈ ఉపగ్రహం బరువు 615 కిలోలు.దీన్ని 555 కి.మీ .ఎత్తులోని,కక్ష్య లో ప్రవేశ పెట్టడానికి 15 నిమిషాల 29 సెకన్ల సమయం పట్టింది.ఇది అత్యాధునిక కృత్రిమ రాడార్ ఇమేజింగ్ ,భూ పరిశీలన ఉపగ్రహం. దీని కాల పరిమితి 5 ఏళ్ళు. దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఇది సులభంగా పసిగడుతుంది.వాతావరణం పరిస్థితులను చాలా ఖచ్చితమైన ఫోటో లను ఇది తీయగల్గుతుంది.దీనిలో వాడిన ప్రాసెసర్ పేరు 'విక్రమ్'.
మరిన్ని వార్తల కొరకు సందర్శించండి...
www.paatshaalaindia.blogspot.com










