Friday, 12 April 2019

అన్నీ సిద్ధం :అయినప్పటికీ తప్పులు దొర్ల కూడదని,15 తర్వాత తెలంగాణా రాష్ట్ర ఇంటర్ ఫలితాలు


తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు 15 వ తేదీ తర్వాత   ప్రకటించ బోతుంది. ఫలితాలు అన్నీ సిద్ధం అయినప్పటికీ ,ఏపీ ప్రకటించినందున పోటీ పడి ప్రకటించడం సరికాదని తెలంగాణ ఇంటర్ బోర్డు భావిస్తుంది.కాబట్టి అన్నీ  ఒకటికి రెండు సార్లు  సరి చూసుకుని,  15 వ తేదీ తర్వాతే ప్రకటించాలని బోర్డు కార్యదర్శి అశోక్ భావిస్తున్నట్లు తెలిసింది.  9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
తెలంగాణా ఇంటర్ ఫలితాల కోసం www.telangana. bie. gov. in లో 15 తర్వాత చూడండి.
మార్కుల జాబితా కోసం కొన్ని ఇతర వెబ్ సైట్ ల లో కూడా చూసుకోవచ్చు.
manabadi.com
results.cgg.gov.in
schools9.com
examresults.net



ప్రతిరోజూ సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com

Thursday, 11 April 2019

విజయ్ దేవరకొండ vs షాహిద్ కపూర్-- "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ "Kabir Singh" – Official Teaser .*** ShahidKapoor

 "అర్జున్ రెడ్డి"   తెలుగులో ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు.ఈ ఒక్క సినిమా తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు.అటువంటి మూవీ ని ఇప్పుడు హిందీ లో KABIR SINGH అనే పేరు తో ,షాహిద్ కపూర్ హీరోగా ,ఒరిజినల్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ కుమార్ వంగా నే డైరెక్టర్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించి టీజర్ ని నిన్న విడుదల చేయగా దీనికి హిందీ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే షాహిద్ కపూర్ అభిమానులు,విజయ్ దేవరకొండ అభిమానులు మా వాడు బాగా చేశాడు అంటే ,మా హీరో బాగా చేశాడు అని మాటల యుద్ధం చేస్తున్నారు.. మీరు చూసి ఎవరు బాగా చేశారో చెప్పండి..!           


Wednesday, 10 April 2019

తెలుగు కవి శివారెడ్డి కి "సరస్వతీ సమ్మాన్"పురస్కారం


బిర్లా ఫౌండేషన్ వారు ప్రతీ ఏటా దేశం లోని అద్భుత రచనలు చేసిన కవులకు,రచయిత లకు అందజేసే "సరస్వతీ సమ్మాన్" అవార్డు 2018   సంవత్సరానికి గాను  ప్రముఖ తెలుగు కవి,రచయిత ,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత  శ్రీ డాక్టర్ కే.శివారెడ్డి ని వరించింది.ఆయన రాసి 2016 లో ప్రచురించిన "పక్కకు ఒత్తిగిలితే"అనే 104 కవితల సంపుటి కి ఈ అవార్డు వచ్చింది.13 మంది వివిధ భాషల నిపుణులతో కూడిన ఎంపిక కమిటీ ఆయనని ఎంపిక చేసింది.ఈ అవార్డు తో పాటు ఒక పతకం, ప్రశంసా పత్రంమఱియు 15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.1991 లో ప్రారంభించిన ఈ అవార్డును పొందిన తొలి తెలుగు వ్యక్తి శివారెడ్డి.ఇతడు జన్మించింది గుంటూరులో అయినప్పటికీ ,సుమారు 50 ఏళ్ల నుండి హైదరాబాద్ లో ఉంటూ ,వివేకా వర్దిని  కళాశాల లో అధ్యాపకుడు గా ,ప్రిన్సిపాల్ గా  చేసి రిటైర్ అయ్యారు. "సరస్వతీ సమ్మాన్"  అవార్డు పొందిన మొదటి వ్యక్తి హరివంశ రాయ్ బచ్చన్.

ప్రతిరోజూ సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు తొలగిన అడ్డంకి:ఈ రోజు అర్ధరాత్రి నుండే నియామక పత్రాలు అందజేత


పంచాయతీ రాజ్ శాఖలో ,9355 జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నియామకానికి మార్గం సుగమమం అయింది.2017 లో పంచాయతీ రాజ్ శాఖలో 9355 జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 2018 అక్టోబర్ 10 న పరీక్ష నిర్వహించారు, డిసెంబర్ లో ఫలితాలు వెల్లడించారు.అయితే పరీక్ష తుది కీ,రాంక్ లు మరియు మార్కుల జాబితా ప్రకటించ కుండానే తుది ఫలితాలు ప్రకటించడం తో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీని నియామకాల పై స్టే విధించి, నిపుణులతో విచారణ చేపట్టింది.ఈ విచారణలో ,పరీక్ష నిర్వహణ లో ఎలాంటి అవకతవకలు జరగలేద ని తేలడంతో ,మార్చి నెల లో కోర్టు స్టే ను ఎత్తి వేసింది.అయితే ఆ సమయానికి ఎమ్మెల్సీ, ఎన్నికల కోడ్, తర్వాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం తో ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టలేకపోయింది.అయితే ఈ ఎన్నికల తర్వాత వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోడ్ రాబోతుండడం తో ,ప్రభుత్వం ఎన్నికల సంఘానికి అనుమతి కోసం విన్నవించగా ,రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం తో చర్చించి , ఈ ఉద్యోగాల నియామకానికి అనుమతి ని ఇచ్చింది.దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్,ఈ పరీక్ష లో ఎంపికైన అభ్యర్థుల కు నియామక పత్రాలను ఈ రోజు అర్ధరాత్రి నుండే ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత తమ అపాయింట్ మెంట్ ఆర్డర్ కాపీలను పొందవచ్చు.

ప్రతిరోజూ సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com

Monday, 8 April 2019

దేశం లో అత్యుత్తమ విద్యా సంస్థ IIT-మద్రాస్:2 వ స్థానంలో IISC బెంగళూరు.

IIT MADRAS


IISC banglore

కేంద్ర మానవ వనరుల విభాగం వారు ప్రతీ ఏటా ప్రకటించే అత్యుత్తమ విద్యా సంస్థ ల జాబితాలో ఈ సంవత్సరం IIT మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది.రెండవ స్థానం లో IISC మద్రాస్ నిలువగా టాప్ టెన్ లో, JNU ఢిల్లీ-7 వ ,బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం 10 వ స్థానం లో నిలిచాయి. టాప్ 10 లో మిగిలిన 6 స్థానాల్లో IIT లు నిలిచాయి.
తెలంగాణా కు సంబంధించి:
ఓవరాల్   విద్యా సంస్థల విభాగంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11 వ స్థానము లో,   IIT హైదరాబాద్ 22 వ స్థానం లో నిలవగా,
యూనివర్సిటీ ల  జాబితాలో HCU  5 వ స్థానాన్ని, ఉస్మానియావిశ్వవిద్యాలయము 28 వ స్థానాన్ని ,ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం 82 వ,ఐఐఐటీ హైదరాబాద్ 98 వ స్థానాల్లో నిలిచాయి.
ఇంజనీరింగ్ విభాగం లో IIT హైదరాబాద్ 9 వ,NIT వరంగల్ 25 వ స్థానంలో,IIIT  హైదరాబాద్ 38,JNTUH 42 వ ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ 80 వ స్థానాల్లో న్ నిలిచాయి.హైదరాబాద్ లోని CBIT ఇంజనీరింగ్ కాలేజ్,       ఇంజనీరింగ్ కాలేజ్  ల విభాగంలో టాప్ 100 లో చోటు దక్కించుకుంది.
ఆంద్రప్రదేశ్ నుండి AU  22 వ  స్థానం,SVU 48 వ స్థానం లో నిలిచాయి.
ప్రతిరోజూ సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com