Saturday, 3 August 2019

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)


 ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:
 02.08.2019 నుండి 17.08.2019 వరకు

అభ్యర్థులకు కాల్ లెటరు డౌన్‌లోడ్ చేయడానికి: 25.08.2019 నుండి 31.08.2019 వరకు

అర్హత : ఎలక్ట్రికల్ డొమెస్టిక్ ఉపకరణాలలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్‌మాన్ ట్రేడ్ లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో గుర్తింపు పొందిన బోర్డు మరియు ఐటిఐ అర్హత నుండి అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి / 10 వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తుదారుల వయో పరిమితి 01.07.2019 నాటికి,
ఈ క్రింది విధంగా ఉండాలి.
కనిష్ట: 18 సంవత్సరాలు.
గరిష్టంగా: 35 సంవత్సరాలు.
అప్లికేషన్ ఫీజు :  రూ. 200 / -.

ఎంపిక ప్రక్రియ :
రాతపరీక్ష,
ఇంటర్వ్యూ,
పత్ర ధృవీకరణ.

మొత్తం ఖాళీల సంఖ్య: 5107 పోస్టులు

తేదీ : 02-08-19.

పూర్తి వివరాలకు సందర్శించండి అధికారిక పోర్టల్‌- www.apspdcl.in

--శివ్.
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం

విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక

Friday, 2 August 2019

IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల



 బ్యాంక్ లలో ప్రొబేషనరీ అధికారుల నియామకానికి సాధారణ నియామక ప్రక్రియ నోటిఫికేషన్ ను IBPS విడుదల చేసింది.
ఆన్‌లైన్ నమోదు మరియు వివరాలు
 తేది- 07.08.19 నుండి 28.08.19 వరకు.
అప్లికేషన్ ఫీ పేమెంట్ (ఆన్ లైన్) :
07.08.19 నుండి 28.08.19 వరకు.
వయస్సు : కనిష్టంగా 20,గరిష్టంగా 30 సంవత్సరాలు.
అర్హత : డిగ్రీ (గ్రాడ్యుయేట్) :  UGC/ప్రభుత్వం చేత గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి.
అప్లికేషన్ ఫీజు: 100 /- SC/ST/PWBD,
                         600 /- For all others
ఎంపిక విధానం :
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

భాగస్వామ్య సంస్థలు:
అలహాబాద్ బ్యాంక్,
కెనరా బ్యాంక్,
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,
 సిండికేట్ బ్యాంక్,
ఆంధ్ర బ్యాంక్,
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్,
యుకో బ్యాంక్,
బ్యాంక్ ఆఫ్ బరోడా,
కార్పొరేషన్ బ్యాంక్,
పంజాబ్ నేషనల్ బ్యాంక్,
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఇండియన్ బ్యాంక్,
పంజాబ్ & సింధ్ బ్యాంక్,
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
పోస్టులు :
SC -670,
ST-299,
OBC-904,
EWS-432,
UR -2031
 మొత్తం :4336.

మరిన్ని వివరాలకు అధీకృత వెబ్‌సైట్ : www.ibps.in ను సందర్శించాలి.
--శివ్.

NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక


ఆసియా నోబెల్ గా భావించి బడే రామన్ మెగసెసే అవార్డు 2019 భారత జర్నలిస్ట్ శ్రీ రవీష్ కుమార్ కి దక్కింది.'NDTV ఇండియా'లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్న రవీష్ కుమార్, సామాన్యుల వాస్తవిక జీవితాలపై ఈ ఛానల్ లో ప్రైమ్ టైం లో నిర్వహిస్తున్న షో ఎంతో ఆదరణ పొందింది.గొంతుక లేని వారికి ప్రజావాణి గా మార్చడమే విలేకరి విధి అని ఈ బాధ్యతను శ్రీ రవీష్ కుమార్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అవార్డు కమిటీ కొనియాడింది.
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరు మీద ఇస్తున్న ఈ అవార్డు కు 2019 సంవత్సర కాలానికి ఐదుగురిని ఎంపిక చేశారు.వీరిలో కో స్వె విన్(మయన్మార్), ఆంగ్ ఖానా నీల పాయిజిత్(థాయిలాండ్),రెముండా పుజాంతే(ఫిలిప్పీన్స్) కిమ్ జోంగ్ కి(దక్షిణ ఆఫ్రికా) లు ఉన్నారు.


TS ED.CET -2019 - కౌన్సిలింగ్ తేదీలు ఖరారు.
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం

విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం

APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

Thursday, 1 August 2019

మరోసారి దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ లు:ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్ లు కూడా..


2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 4 సార్లు 'దోస్త్' విధానం లో ఆన్ లైన్ అడ్మిషన్ ల ప్రక్రియ జరిగింది.నీటితో 4 వ దఫా అడ్మిషన్ ల ప్రక్రియ పూర్తి కానుంది. 5,6 తేదీ లలో గ్రూప్ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.ఇక తర్వాత 5 వ సారి దోస్త్ అడ్మిషన్ లకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.అది పూర్తి కాగానే స్పాట్ అడ్మిషన్ లు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.

ఫస్ట్ అటెంప్ట్ లొనే సివిల్స్ క్లియర్ చేయాలంటే ఏం చేయాలి..??


 సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మొదటి ప్రయత్నం లొనే విజయం సాధించాలి అంటే ఏం చేయాలో తెలుసు కోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో "unacademy"వారి వీడియో ..presented by Siddharth Arora

Monday, 29 July 2019

తెలంగాణ లో మరియు దేశంలో పెరిగిన పెద్ద పులుల సంఖ్య:2018 పులుల సెన్సస్ రిపోర్ట్ -*కరెంట్ ఎఫైర్స్*


2018 టైగర్ సెన్సస్ రిపోర్ట్ ను ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ మరియు కేంద్ర పర్యావరణ -అటవీ శాఖలు సంయుక్తంగా పులుల సంఖ్యను లెక్కించాయి.2006 నుండి ప్రతీ  నాలుగేళ్లకోకసారి ఈ లెక్కింపు జరుపుతున్నారు.
దీని ప్రకారం దేశంలో పులుల సంఖ్యలో 33 శాతం పెరుగుదల కనిపించింది. 2014 లో లెక్కించిన లెక్కల ప్రకారం 2,226 నుండి 2,967 కి పెరిగినట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలిసింది.
ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మధ్య ప్రదేశ్ గరిష్టంగ 526 ,పులులను కల్గి ఉండగా , కర్ణాటక 524 పులా సంఖ్యతో రెండో స్థానం లో నిలిచింది. మిజోరాం,చత్తిస్ గడ్ లలో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల లో పులుల సంఖ్య  పెరిగినట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 లో 68 పులులు ఉండగా ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కల్సి 74  పులులు ఉన్నాయి.
2014 లో తెలంగాణా లో 20 పులులు (అమ్రాబాద్ 17, కవ్వాల్ 3) ప్రస్తుతంతెలంగాణా లో 26 పులులు (అమ్రాబాద్ 14, కవ్వాల్ లో 12 ) ఉన్నట్లు గా తేలింది.
 ఆంధ్రప్రదేశ్ లో 48 పులులు ఉన్నాయి.తెలంగాణా లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్,కవ్వాల్ టైగర్ రిజర్వ్ ల లో పులులు సంరక్షించ బడుతున్నాయి.
ఏది ఏమైనా దేశం లోని అన్ని రాష్ట్రాల కృషి వల్ల పులి వంటి వన్య ప్రాణుల సంఖ్య పెరగడం మనిషికి ప్రకృతి సంరక్షణ పై కొంత సానుకూల దృక్పథం ఏర్పడిందని చెప్ప వచ్చు.

CAT (కామన్ అడ్మిషన్ టెస్ట్)-2019 విడుదల :పూర్తి వివరాలు



దేశం లోని ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్  మేనేజ్ మెంట్(ఐఐఎం) లు కూడా ముఖ్య మైనవి.ప్రస్తుతం దేశం లో మొత్తం 20  ఐఐఎం లు ఉన్నాయి.వీటిలో ప్రవేశానికి ప్రతి సంవత్సరం కామన్ అడ్మిషన్ టెస్ట్ (Common Admission Test) ఇవి నిర్వహిస్తాయి. ఇందులో ర్యాంక్ ను బట్టి ఆయా ఐఐఎం లలో  వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లు మరియు ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్ లు పొందవచ్చు.అంతే కాదు దేశం లోని కొన్ని నాన్ ఐఐఎం సెంటర్ లలో కూడా అడ్మిషన్ పొందడానికి CAT స్కోరు ను పరిగణలోకి తీసుకుంటారు.ఐఐఎం లలో చదివినవారికి అద్భుతమైన ప్లేస్ మెంట్లు మంచి వేతనాలు గల ఉద్యోగాలు జాతీయ అంతర్జాతీయ కంపనీలలో లభిస్తాయి.నిన్న అంటే జూలై 28, 2019 రోజున CAT-2019 నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు :

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ :.August 07, 2019(10.00AM) రోజున ఈ పరీక్షకు సంబంధించిన

రిజిస్ట్రేషన్ గడువు ముగింపు: September 18(5.00 PM) 2019 రోజున

హాల్ టికెట్ డౌన్ లోడ్ గడువు: అక్టోబర్ 23 నుండి నవంబర్ 24 వరకు.

పరీక్ష తేదీ:  నవంబర్ 24 , 2019 న 

రిజల్ట్ : జనవరి ,2020 రెండవ వారం   

అర్హత : యూజీసీ చేత గుర్తింపబడిన ఏదైనా యునివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.
             జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి.
             SC ,ST మరియు వికలాంగ అభ్యర్థులు 45 % మార్కులతో పాస్ అయి ఉండాలి.
            ఇప్పుడు CBCS విధానం కావున అభ్యర్థులు ఆయా యునివర్సిటీ ఇచ్చిన CGPA ను శాతం లోకి
            మార్చి  రిగణిస్తారు.
రిజర్వేషన్:   ఐఐఎం లలో సీట్ల కేటాయింపు క్రింది  రిజర్వేషన్ ల ఆధారంగా జరుగుతుంది.
                     15% -SC అభ్యర్థులకు

                     7.5% ST- అభ్యర్థులకు

                     27% -ఇతర వెనుక బడిన (Other Backward Classes )“non-creamy” layer (NC-OBC)
                     అభ్యర్థులకు

                     10%  ఆర్థికంగా బలహీన వర్గాల (Economically Weaker Sections-EWS) అభ్యర్థులకు.
పరీక్ష విధానం :  కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ఫీజు : SC, ST అభ్యర్థులకు & వికలాంగ అభ్యర్థులకు 950 రూపాయలు
           ఇతరులు అందరికీ 1900 రూపాయలు.

నోట్ : ఒక అభ్యర్థి అన్ని ఐఐఎం లకి ఒక్కసారి ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


పరీక్షా కేంద్రాలు : దేశం లోని గుర్తింపు పొందిన 156 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడును.

దేశం లోని ఐఐఎం లు: అవి ఆఫర్ చేసే కోర్సులు

      మరిన్ని వివరాలకు CAT website: www.iimcat.ac.in  సందర్శించగలరు.


Sunday, 28 July 2019

ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన మేరీ కోమ్


ఆరు సార్లు ప్రపంచ  బాక్సింగ్ ఛాంపియన్ భారత బాక్సర్ మేరీ కోమ్ ఇండోనేసియా లో జరుగుతున్న ప్రెసిడెంట్ కప్ టోర్నీ ఫైనల్ లో ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఏప్రిల్ పై ఘన విజయం సాధించింది.51 కేజీ ల విభాగం లో జరిగిన ఈ పోటీలో సెమీ ఫైనల్లో వియత్నాం బాక్సర్ అన్ హ్ వో కిమ్ పై 3-2 తో చెమటోడ్చి నెగ్గగా ఫైనల్లో సులువుగా నెగ్గింది.కాగా సెప్టెంబర్ నెలలో రష్యా లో  జరుగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ కి మేరీ సిద్ధమవుతోంది.