Saturday, 30 March 2019

తెలంగాణ ,ఏపీ ల లో ఉపాధి హామీ పథకం కూలీల కు దినసరి వేతనం 211 రూపాయలు గా నిర్ణయం.


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కూలీ లకు ప్రతి రోజు ఇచ్చే వేతనాన్ని ఈ సంవత్సరానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో, రోజుకు 211 రూపాయలు గా కేంద్రం నిర్ణయించింది.ఇది గత సంవత్సరం 205   రూపాయలు గా ఉండేది.ప్రతీ సంవత్సరం కేంద్రం ఏప్రిల్ నెల లో ఈ పథకం వేతనాన్ని సవరిస్తుంది. ఈ సంవత్సరం గరిష్టంగా హర్యానా లో 284 రూపాయలు గా,కనిష్టం గా బీహార్ ,జార్ఖండ్ రాష్ట్రాల్లో 171 రూపాయలు గా నిర్ణయించారు.

డైట్ సెట్(DEE CET) ఎంట్రన్స్ పరీక్ష కు దరఖాస్తు గడువు పెంపు.


డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 ఏళ్ల కోర్సు లో చేరడానికి నిర్వహించనున్న DEECET 2019 పరీక్ష కొరకు అప్లై చేసుకోవడానికి గడువు తేదీని ఈ నెల 15 వ తేదీ వరకు         పొడిగించినట్లు ,DEECET కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి        ప్రకటించారు. ఇంతకు ముందు ఏప్రిల్ 4 వ తేదీ చివరి తేదీ ఉండేది.  అంతే కాకుండా అభ్యర్థులు ఏ మీడియం లో పరీక్ష రాయాలనుకుంటున్నారో దరఖాస్తులో స్పష్టంగా రాయాలని తెలిపారు.   ఏమైనా డౌట్స్  ఉంటే 75698 74190 నంబర్ కి కాల్ చేయాలని తెలిపారు.    D.Ed అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్.ఇది చేసిన వారు ప్రాథమిక పాఠశాల లలో  SGT టీచర్ ఉద్యోగానికి అర్హులవుతారు.

I-CET -2019 నోటిఫికేషన్ ని విడుదల :కాకతీయ యూనివర్సిటీ నిర్వహణ



తెలంగాణ లో 2019 సంవత్సరానికి గాను I-CET నోటిఫికేషన్ ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది.దీనిని ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ MBA &MCA అని పిలుస్తారు.దీనికి డిగ్రీ పాసైన వారు అర్హులు.ఇందులో అర్హత సాధించిన వారు తెలంగాణ పరిధి లో ఉన్న అన్ని యూనివర్సిటీ ల పరిధి లో వారి వారి ఆప్షన్ ని బట్టి MBA లేదా MCA చేయ వచ్చు.దీని ముఖ్య వివరాలు.
ముఖ్య తేదీలు:
University  ల పరిధి:


పరీక్షా కేంద్రాలు:

Wednesday, 27 March 2019

"మిషన్ శక్తి " విజయ వంతం:ప్రధాని మోడీ హర్షం: 4 అగ్రదేశాల సరసన భారత్


భారత దేశ శాస్త్రవేత్తలు మరో ఘనతను సాధించారు.మన దేశ అమ్ముల పొది మరో అస్త్రం చేరింది.ఎన్నో దేశాలు సాధించలేని ఘనతను భారత్ సాధించింది. స్పేస్ లో ఉన్న ఒక శాటిలైట్ ను మిస్సైల్ తో కూల్చే, సాంకేతిక పరిజ్ఞానం ను భారత్ "మిషన్ శక్తి" పేరిట ఈ రోజు సాధించింది. ఈ మిస్సైల్ ని ASAT(Anti Satilite missile) అంటారు.పరీక్ష కోసం మన drdo శాస్త్రవేత్తలు తయారు చేసిన ఒక శాటిలైట్ ను భూమి నుండి 300 కి.మీ.ఎత్తులో, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్(వీలర్స్ ఐలాండ్) నుండి ప్రయోగించిన  మిస్సైల్ తో పేల్చేశారు.     ఈ సాంకేతికత పూర్తి స్వదేశీ సాంకేతికత. ఈ విజయం పై భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు.శాస్త్రవేత్తల కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటివరకూ అమెరికా (1958), రష్యా(1964) , చైనా(2007) లు మాత్రమే సాధించిన మరో ఘనతను ఇండియా కూడా సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన, అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను కూల్చివేశామని, ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని, ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని అన్నారు. లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోని ఈ లైవ్ శాటిలైట్ ను ఏ-శాట్ (యాంటీ శాటిలైట్) మిసైల్ ద్వారా కేవలం మూడు నిమిషాల వ్యవధిలో కూల్చేశామని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, 'మిషన్ శక్తి' పేరిట ఇది జరిగిందని అన్నారు. ఇకపై ఇండియా ఎటువంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా చేరిందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
దేశ ప్రజలు అందరూ ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చైనా దేశం ఈ విజయం పై ఆచి తూచి స్పందించింది.ఆసియా లో రెండు దేశాలు అంతరిక్షం లో శాంతి కి కృషి చేయాలని పిలుపునిచ్చింది.

Monday, 25 March 2019

జె ఎల్ ,డీ ఎల్ పరీక్షల ఫలితాలు విడుదల:వివరాలు వెబ్ సైట్ లో

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికంగా భర్తీ చేసిన పోస్టుల లో పోలీసు ఉద్యోగాల తర్వాత, గురుకుల విద్యాలయా ల టీచర్ ల లెక్చరర్ ఉద్యోగాల దే. గత నెల లో  తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు  నిర్వహించిన
జె ఎల్ ,డీ ఎల్  ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష యొక్క ఫలితాల ను ఆ బోర్డ్ తమ వెబ్ సైట్ లో ఉంచింది.సుమారు 466  పోస్టుల డిగ్రీ అధ్యాపకులు, 281 జూనియర్ కళాశాల ల అధ్యాపకుల పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది.ఈ ఫలితాలను చాలా తొందరగా ప్రకటించడం తో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్ష మార్కుల జాబితాను సంస్థ అడ్రస్
 https://treirb.telangana.gov.in/ లో చూడవచ్చు.