Sunday, 20 September 2020

చొప్పదండి నియోజకవర్గం లో చేపల పెంపకం......!


ఈరోజు చొప్పదండి నియోజకవర్గం తాటిపల్లి గ్రామంలో చేపల పెంపకం కోసం యువ రైతులను ప్రోత్సహించడం జరిగింది తాటిపల్లి లోని ఖజానా చెరువు( పెద్ద చెరువు ) లో 58 వేల చేప పిల్లలను నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు వేయడం జరిగింది ఇలాగే నియోజకవర్గంలో ఉన్న యువ రైతులను ప్రోత్సహించాలని అని గ్రామ ప్రజలు రైతులు విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు zptc,mptc,sarpanch పాల్గొన్నారు 

Tuesday, 8 September 2020

ఈనెల 16 మంది శాతవాహన యూనివర్సిటీ చివరి సంవత్సరం పరీక్షలు....!

కోవిడ్19 లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నుండి జరగాల్సిన అనేక పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేస్తారని విద్యార్థులను ప్రమోట్ చేస్తారని అనేక వాదోపవాదాలు వినిపించాయి. కానీ సుప్రీం కోర్టు తీర్పు మేరకు చివరి సెమిస్టర్ పరీక్షలు తప్పకుండా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు యూజిసి విడుదల చేసిన మార్గదర్శకాలతో అన్ని యూనివర్సిటీలు చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి పరీక్షల కాలపట్టిక విడుదల చేస్తున్నాయి ఈ మేరకు శాతవాహన యూనివర్సిటీ ఈనెల 16 నుండి ఆరవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య టి. భరత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు అందుకు సంబంధించిన కాలపట్టిక ను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి రుసుము ఇదివరకే విద్యార్థులంతా చెల్లించి ఉన్నారు. పరీక్షల తేదీ ఖరారు చేయడంతో విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.

Monday, 7 September 2020

రిజిస్ట్రేషన్లు అన్ని బంద్...!

TS లో లో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవాల్టి నుండి ఈ-స్టాంపుల విక్రయాలను నిలిపివేయగా... చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లకి  ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇకపై రిజిస్ట్రేషన్లు కొత్త చట్టం ప్రకారం జరిగే అవకాశం ఉంది

Thursday, 3 September 2020

దేశంలో ఒక్కరోజే 83 వెల కరొన కేసులు నమోదు.....!


గడిచిన 24 గంటల్లో భారత దేశంలో 83,883 కరోన కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,407వేలకు చేరింది. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1043మంది మృత్యువాతపడగా, మొత్తం 67,376మంది మరణించారు.కరోన రికవరీ రేటు 77.09 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Monday, 31 August 2020

రికార్డు స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పతనం.....!


దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి  విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో తొలి త్రైమాసికంలో భారీగా క్షీణతను నమోదు చేసింది.నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం  ప్రకటించిన అధికారిక  గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా ఉంది. కరోనా సంక్షోభంతో గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.1996లో భారతదేశం త్రైమాసిక గణాంకాలను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా  తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం  పడిపోయింది. జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉంది. అనుకూలమైన రుతుపవనాలు, నిండిన జలాశయాలలో నీటి లభ్యత, ఖరీఫ్ విత్తనాలు,  పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల  సేకరణ  బలమైన రబీ ఉత్పత్తి వ్యవసాయ వృద్ధికి తోడ్పడినట్లు తెలుస్తోంది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు.....!


మాజీ రాష్ట్రపతి,భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (ఆగస్టు 31) సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆ మహానేత చావు తోటి దేశమంతా ప్రజలు కన్నీరు పెడుతున్నారు ఆ నాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు

భారతదేశ మొట్టమొదటి మహిళ హృదయ రోగ వైద్యురాలు మృతి.....!


భార‌త మొట్టమొద‌టి మ‌హిళా కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎస్ ప‌ద్మావ‌తి (103) క‌న్నుమూశారు. క‌రోనా కార‌ణంగా ఆరోగ్యం విష‌మించి తుదిశ్వాస విడిచిన‌ట్లు వైద్యులు తెలిపారు. వైద్య‌రంగంలో ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లున్న ప‌ద్మావ‌తి గ‌త 11 రోజుల క్రితం నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. 1981లో ఆమె స్థాపించిన ఆస్పత్రిలోనే క‌న్నుమూయ‌డంతో అక్క‌డ విషాద చాయ‌లు అలుముకున్నాయి. వ‌య‌సుమీద ప‌డ‌టం, క‌రోనా వ‌ల్ల  ఆమె ఆరోగ్యం మ‌రింత క్షీణించి మ‌రణించినట్లు ఆసుప‌త్రి సీఈవో డాక్టర్‌ ఓపీ యాదవ్ వెల్ల‌డించారు. గాడ్‌మదర్‌ ఆఫ్‌ కార్డియాలజీగా ప‌ద్మావ‌తి ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. ఆమె చేసిన సేవ‌ల‌కు గుర్తుగా భార‌త ప్ర‌భుత్వం 1967తో  ప‌ద్మ భూష‌ణ్, 1992లో ప‌ద్మ విభూష‌ణ్ అవార్డుల‌తో స‌త్క‌రించింది. డాక్టర్‌ ప‌ద్మావ‌తి మ‌ర‌ణంపై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం, వైద్య నిపుణులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. మొట్ట‌మొద‌టి మ‌హిళా కార్డియాల‌జిస్ట్‌గా ప‌ద్మావ‌తి సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అని గుర్తుచేసుకున్నారు.

చైనా కవ్వింపు చర్యలకు.......గట్టిగా బదులు ఇచ్చిన భారత్...!


భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది చైనా ఆర్మీ చర్యలకు భారత సైన్యం ఘాటుగా సమాధానమీచ్చింది తూర్పు లదాఖ్‌, ప్యాంగ్‌యాంగ్ త్సో‌ సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్‌ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది.ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రత్యర్థి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది.ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో చుషుల్‌ వద్ద బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది.

Saturday, 29 August 2020

ఇకపై మాస్కులు లేకుంటే....గాలిలో ఎగరలేము...!


*డిజెసిఎ కొత్త నిబంధనలు
* దేశీయంగా ప్రీ- ప్యాక్డ్ భోజనాలు, పానీయాలకు అనుమతి

దేశంలో కరోనా కట్టడికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మాస్క్ లేకుండా ఎవరు విమాన ప్రయాణం చేయరాదని తేల్చిచెప్పిందిఅంతేకాదు విమానంలో ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్‌లైన్స్,  క్యాబిన్ సిబ్బందికి అధికారం ఉందని వెల్లడించింది.
గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, దేశీయ విమానాలలో ముందుగా ప్యాక్ చేసిన స్నాక్స్, భోజనం, ఇతర పానీయాలకు అనుమతి ఉంటుంది. విమానయాన వ్యవధిని బట్టి దేశీయ విమానాలలో ప్రీ-ప్యాక్డ్  భోజనం, పానీయలను అందించవచ్చు.

Friday, 28 August 2020

వచ్చే నెల 14 నుండి డిగ్రీ పరీక్షలు...?


తెలంగాణలో డిగ్రీ ,పీజీ పరీక్షలపై ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీ రిజిస్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది సెప్టెంబర్ 14 నుండి డిగ్రీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు, యూనివర్సిటీలు పరీక్షల షెడ్యూల్ ని రెండు  రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది అటు పీజీ ,డిగ్రీ బ్యాక్ లాగ్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించాలని, ఇందుకు UGC (University Grants Commission ) అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది