*డిజెసిఎ కొత్త నిబంధనలు
* దేశీయంగా ప్రీ- ప్యాక్డ్ భోజనాలు, పానీయాలకు అనుమతి
దేశంలో కరోనా కట్టడికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మాస్క్ లేకుండా ఎవరు విమాన ప్రయాణం చేయరాదని తేల్చిచెప్పిందిఅంతేకాదు విమానంలో ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుత డీజీసీఏ నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్లైన్స్, క్యాబిన్ సిబ్బందికి అధికారం ఉందని వెల్లడించింది.
గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, దేశీయ విమానాలలో ముందుగా ప్యాక్ చేసిన స్నాక్స్, భోజనం, ఇతర పానీయాలకు అనుమతి ఉంటుంది. విమానయాన వ్యవధిని బట్టి దేశీయ విమానాలలో ప్రీ-ప్యాక్డ్ భోజనం, పానీయలను అందించవచ్చు.



0 comments:
Post a Comment