Friday, 10 July 2020

సంపద లో అపర కుబేరుడు బఫెట్ ను వెనక్కి నెట్టిన ముఖేష్ అంబానీ


భారత కుబేరుడు ,ఆసియా లోనే అత్యధిక దన వంతుడు ముఖేశ్ అంబానీ,అమెరికా పెట్టుబడుల కుబేరుడు వారెన్ బఫెట్ ను సంపదలో వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో 8 వ స్థానం లో నిలిచాడు.బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సంస్థ
ముఖేశ్ అంబానీ ఆస్తి విలువ 68.3బిలియన్ డాలర్లు,అంటే 5.12 లక్షల కోట్లు,కాగా బఫెట్ సంపద 67 బిలియన్ డాలర్లు.కాగా ప్రపంచం లో నే అత్యంత ధనవంతుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. (188బి.),తర్వాత బిల్ గేట్స్(115బి),బెర్నార్డ్ ఆర్నాల్డ్(92.8),మార్క్ జుకర్ బర్గ్(92.7) లు తర్వాతి స్థానాల లో ఉండగా,ముఖేశ్ అంబానీ 8వ స్థానం,బఫెట్ 9 వ స్థానాలలో ఉన్నారని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సంస్థ తెలిపింది.

Thursday, 9 July 2020

కరోనా వాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వ వివరణ :రాజీ పడబోం


కరోనా వాక్సిన్ ఆగస్ట్ 15 వరకు వస్తుందని భారత ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ మరియు భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాక వెలువడిన అనేక విమర్శల అనంతరం ..కేంద్ర ఆరోగ్య శాఖ ..వివరణ ఇచ్చింది.వాక్సిన్ పనితీరుని పూర్తిస్థాయిలో పరీక్షించాకే విడుదల చేస్తామని,ఇందులో ఎలాంటి తొందర పాటు చర్య ఉండబోదని ప్రకటించింది.క్లినికల్ ట్రయల్స్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితేనే వాక్సిన్ ని విడుదల చేస్తామని ఇందులో ఏ మాత్రం రాజీ పడబోమని,ఆగస్ట్ 15 వరకు వస్తుందనే విషయం ఇప్పుడే చెప్పలేం అని ప్రకటించింది. 

"జూమ్" చైనా సంస్థ కాదు : ఇది అమెరికన్ యాప్


కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ,దాదాపు అన్ని ప్రభుత్వాలు,ఆన్ లైన్ క్లాస్ ల పై ఆధార పడ్డ విషయం అందరికి తెల్సిందే..అయితే ఈ కాలం లో అందరికీ ఎంతో ఉపయోగపడిన ,యాప్ జూమ్ యాప్.సిస్కో వెబ్ ఎక్ష్ ,గూగుల్ మీట్ వంటి యాప్ లు ఉన్నప్పటికీ ,వీటి అన్నిటికన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందిన యాప్ .."జూమ్ " అయితే ఇప్పటి వరకు అందరూ కూడా ఈ యాప్  చైనీస్ కంపనీ అని అపోహ పడ్డారు.కానీ నిజానికి ఈ కంపనీ అమెరికన్ కంపనీ అట ..ఆ సంస్థ అమెరికా లోని క్యాలి ఫోర్నియాలోని  శాన్ జోన్స్ నగరం లో ప్రారంభం అయిందట..ఈ విషయాన్ని"జూమ్" ఇంజినీరింగ్, ప్రాడక్ట్స్ అధ్యక్షుడు వెల్చామి శంకరలింగం తెలిపారు.అయితే ఈ సంస్థ సీయీవో పేరు ఎరిక్ ఎస్ యువాన్ ,అతను చైనా మూలాలు ఉన్న వ్యక్తి.అందువల్ల నె అందరూ ఈ కంపనీ చైనా కంపనీ అని అపోహపడ్డారని అతడు తెలిపాడు.

తెలంగాణా లో ఇంటర్ ఫెయిల్ అయిన వారికి శుభవార్త : సప్లిమెంటరీ పరీక్షలు రద్దు


తెలంగాణా రాష్ట్ర విద్యా శాఖ ,ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలను రద్దు చేసింది.కరోనా వైరస్ ప్రభావం రాను రాను తీవ్రం కావడం తో ,ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు.ఇక ఈ పరీక్ష రద్దు చేయడంతో ,ద్వితీయ సంవత్సరం పూర్తయ్యి..ఫెయిల్ అయిన విద్యార్థులను అందరినీ కంపార్ట్ మెంటల్ పాస్ చేయనున్నట్టు మంత్రి తెలిపారు.దీనివల్ల 1.47 లక్షల విద్యార్థులు లబ్ది పొందుతారు.ఈ మెమోలు ..జూలై 31 నుండి ఆయా కళాశాల లలో అందుబాటు లోకి వస్తాయి.అయితే ఇప్పటికే రీ వాల్యూయేషన్ కట్టిన వారి పలితాలు 10 రోజుల తర్వాత వెల్లడవుతాయి.
www.paatshaalaindia.blogspot.com