Thursday, 9 July 2020

తెలంగాణా లో ఇంటర్ ఫెయిల్ అయిన వారికి శుభవార్త : సప్లిమెంటరీ పరీక్షలు రద్దు


తెలంగాణా రాష్ట్ర విద్యా శాఖ ,ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలను రద్దు చేసింది.కరోనా వైరస్ ప్రభావం రాను రాను తీవ్రం కావడం తో ,ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర విద్య శాఖ మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు.ఇక ఈ పరీక్ష రద్దు చేయడంతో ,ద్వితీయ సంవత్సరం పూర్తయ్యి..ఫెయిల్ అయిన విద్యార్థులను అందరినీ కంపార్ట్ మెంటల్ పాస్ చేయనున్నట్టు మంత్రి తెలిపారు.దీనివల్ల 1.47 లక్షల విద్యార్థులు లబ్ది పొందుతారు.ఈ మెమోలు ..జూలై 31 నుండి ఆయా కళాశాల లలో అందుబాటు లోకి వస్తాయి.అయితే ఇప్పటికే రీ వాల్యూయేషన్ కట్టిన వారి పలితాలు 10 రోజుల తర్వాత వెల్లడవుతాయి.
www.paatshaalaindia.blogspot.com
                                       

0 comments:

Post a Comment