Thursday, 9 July 2020

కరోనా వాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వ వివరణ :రాజీ పడబోం


కరోనా వాక్సిన్ ఆగస్ట్ 15 వరకు వస్తుందని భారత ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ మరియు భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాక వెలువడిన అనేక విమర్శల అనంతరం ..కేంద్ర ఆరోగ్య శాఖ ..వివరణ ఇచ్చింది.వాక్సిన్ పనితీరుని పూర్తిస్థాయిలో పరీక్షించాకే విడుదల చేస్తామని,ఇందులో ఎలాంటి తొందర పాటు చర్య ఉండబోదని ప్రకటించింది.క్లినికల్ ట్రయల్స్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితేనే వాక్సిన్ ని విడుదల చేస్తామని ఇందులో ఏ మాత్రం రాజీ పడబోమని,ఆగస్ట్ 15 వరకు వస్తుందనే విషయం ఇప్పుడే చెప్పలేం అని ప్రకటించింది. 

0 comments:

Post a Comment