గడిచిన 24 గంటల్లో భారత దేశంలో 83,883 కరోన కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,407వేలకు చేరింది. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1043మంది మృత్యువాతపడగా, మొత్తం 67,376మంది మరణించారు.కరోన రికవరీ రేటు 77.09 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Thursday, 3 September 2020
Monday, 31 August 2020
రికార్డు స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పతనం.....!
By . at August 31, 2020
No comments
దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో తొలి త్రైమాసికంలో భారీగా క్షీణతను నమోదు చేసింది.నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతంగా ఉంది. కరోనా సంక్షోభంతో గత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతం వృద్ధి నమోదైంది.1996లో భారతదేశం త్రైమాసిక గణాంకాలను ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం పడిపోయింది. జూన్ త్రైమాసికంలో వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉంది. అనుకూలమైన రుతుపవనాలు, నిండిన జలాశయాలలో నీటి లభ్యత, ఖరీఫ్ విత్తనాలు, పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సేకరణ బలమైన రబీ ఉత్పత్తి వ్యవసాయ వృద్ధికి తోడ్పడినట్లు తెలుస్తోంది.
భారతదేశ మొట్టమొదటి మహిళ హృదయ రోగ వైద్యురాలు మృతి.....!
By . at August 31, 2020
No comments
భారత మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ పద్మావతి (103) కన్నుమూశారు. కరోనా కారణంగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. వైద్యరంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న పద్మావతి గత 11 రోజుల క్రితం నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 1981లో ఆమె స్థాపించిన ఆస్పత్రిలోనే కన్నుమూయడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. వయసుమీద పడటం, కరోనా వల్ల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి మరణించినట్లు ఆసుపత్రి సీఈవో డాక్టర్ ఓపీ యాదవ్ వెల్లడించారు. గాడ్మదర్ ఆఫ్ కార్డియాలజీగా పద్మావతి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1967తో పద్మ భూషణ్, 1992లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. డాక్టర్ పద్మావతి మరణంపై ఆస్పత్రి యాజమాన్యం, వైద్య నిపుణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్గా పద్మావతి సేవలు చిరస్మరణీయం అని గుర్తుచేసుకున్నారు.
చైనా కవ్వింపు చర్యలకు.......గట్టిగా బదులు ఇచ్చిన భారత్...!
By . at August 31, 2020
No comments
భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది చైనా ఆర్మీ చర్యలకు భారత సైన్యం ఘాటుగా సమాధానమీచ్చింది తూర్పు లదాఖ్, ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది.ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రత్యర్థి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది.ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది.


