కోవిడ్19 లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నుండి జరగాల్సిన అనేక పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేస్తారని విద్యార్థులను ప్రమోట్ చేస్తారని అనేక వాదోపవాదాలు వినిపించాయి. కానీ సుప్రీం కోర్టు తీర్పు మేరకు చివరి సెమిస్టర్ పరీక్షలు తప్పకుండా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు యూజిసి విడుదల చేసిన మార్గదర్శకాలతో అన్ని యూనివర్సిటీలు చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి పరీక్షల కాలపట్టిక విడుదల చేస్తున్నాయి ఈ మేరకు శాతవాహన యూనివర్సిటీ ఈనెల 16 నుండి ఆరవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య టి. భరత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు అందుకు సంబంధించిన కాలపట్టిక ను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి రుసుము ఇదివరకే విద్యార్థులంతా చెల్లించి ఉన్నారు. పరీక్షల తేదీ ఖరారు చేయడంతో విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.
Tuesday, 8 September 2020
ఈనెల 16 మంది శాతవాహన యూనివర్సిటీ చివరి సంవత్సరం పరీక్షలు....!
By . at September 08, 2020
No comments
Monday, 7 September 2020
రిజిస్ట్రేషన్లు అన్ని బంద్...!
By . at September 07, 2020
No comments
TS లో లో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవాల్టి నుండి ఈ-స్టాంపుల విక్రయాలను నిలిపివేయగా... చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇకపై రిజిస్ట్రేషన్లు కొత్త చట్టం ప్రకారం జరిగే అవకాశం ఉంది


