Wednesday, 22 May 2019

డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల ప్రక్రియ నోటిఫికేషన్ (DOST)విడుదల:


ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు,  డిగ్రీ లో ప్రవేశాల కోసం ‘దోస్త్‌’ (Degree online Services ,Telangana-DOST)నోటిఫికేషన్‌ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ను దోస్త్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది.
ఈ ప్రక్రియ 3  దశలలో పూర్తి కానుంది.
ఈ ప్రక్రియ 1ఈ నెల 23 నుండి వచ్చే నెల 29 వరకు కొనసాగుతుంది. జులై 1 నుండి తరగతులు ప్రారంభం అవుతాయి.

ఆన్‌లైన్‌  ప్రవేశాలకు సంబంధించిన ముఖ్య విషయాలు.

ప్రతి అభ్యర్థి తన ఆధార్ నంబర్ ని మొబైల్ తో లింక్ చేసుకోవాలి.

 ఈ నెల 23 నుంచి జూన్‌ 3 వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్లు

 ఈ నెల 25 నుంచి జూన్‌ 3 వరకు  వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

 జూన్‌ 10 వరకు మొదటి విడత సీట్ల కేటాయింపు

జూన్‌ 10 నుంచి జులై 15 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు

 జూన్‌ 20న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

 జూన్‌ 20 నుంచి 26 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు

జూన్‌ 29న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

 జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం


0 comments:

Post a Comment