Friday, 26 July 2019

త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సొంత గృహాలు..!


త్వరలొనే ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నెరవేరనుంది.ముఖ్యంగా పట్టణాల్లోని దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హైదరాబాద్ లోని పోచారం ,బండ్ల గూడ ల లోని 3200 అపార్టుమెంట్ ఫ్లాట్ లను రాష్ట్ర ప్రభుత్వం  కేటాయించనుంది."ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్" పద్దతిలో ఈ ఫ్లాట్ లను  సుమారు 23 నుండి 30 లక్షల ధరతో విక్రయించనున్నట్లు సమాచారం. అయతేి మునిసిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నందు వల్ల ,ఎలక్షన్స్ అయ్యాక ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.2016 లో జీవో నెంబర్ 201 ద్వారా అప్పటి సీఎస్ ఆద్వర్యంలో రాజీవ్ గృహకల్ప సంస్థ ద్వారా,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బండ్లగూడ, పోచారం ల లో 3710 ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టారు.కాగా ఇందులో సింగిల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ అన్నీ అమ్ముడు పోగా 3200 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లు మిగిలాయి.వీటిని ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23 లక్షల నుండి 30 లక్షల ధరలో అమ్మనున్నారు.అయితే ఈ డబ్బు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా చెల్లించ వచ్చు మరియు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వారు బ్యాంక్ లోన్ పొందటం లో ఉద్యోగుల కు సహాయం చేస్తుంది.వీటిలో ఫినిష్డ్, సెమీ ఫినిష్డ్ రకాలు ఉన్నాయి.

0 comments:

Post a Comment