నవంబర్ మొదటి వారంలో కొత్త విద్యార్థులకు తరగతులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్. సి. యు)2020-21 విద్యాసంవత్సరంలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సులలో ప్రవేశానికి పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24 26 తేదీలలో ప్రవేశ పరీక్ష లను నిర్వహించినట్లు బుధవారం హెచ్. సి. యు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు వెల్లడించారు. జేఈఈల నిర్వహణకు ప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హెచ్ సి యు ఈ నూతన షెడ్యూల్ తో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ ఏడాది 62,583 మంది ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు పరీక్షల నిర్వహణ అనంతరం ఇతర ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ మొదటివారంలో కొత్త విద్యార్థుల కోసం తరగతులను ప్రారంభించాలని హెచ్ సి యు భావిస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాచ్లలో సుమారు 2000 మంది విద్యాసంవత్సరంలో విద్యాసంవత్సరంలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గురువారం నుంచి ఆన్లైన్ లో తరగతులు ప్రారంభిస్తామని అన్నారు. మరోవైపు ఆన్లైన్ సెమిస్టర్ కోసం హెచ్ సి యు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ విభాగాల వద్ద ఐసిటి మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా ఉపయోగించగల అభ్యాస నిర్వహణ వ్యవస్థను (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశామన్నారు.



0 comments:
Post a Comment