Thursday, 25 April 2019

ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అందరికి ఉచితంగా రీ వెరిఫికేషన్:బోర్డు ప్రకటన


ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరికీ రీ వెరిఫికేషన్ చేస్తామని ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.ఇంటర్ ఫలితాలలో నెలకొన్న గందరగోళం దరిమిలా ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా ,ఎలాంటి దరఖాస్తు లేకుండానే రీవేరిఫికేషన్ చేస్తామని విచారణ కమిటీ ఇంచార్జ్ బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు వాపస్ చేస్తామని తెలిపారు.

అయితే పాసై రీవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి.ఇప్పటికే రీవెరిఫికేషన్ కోసంప్రతిజిల్లాలోక్యాంప్ఆఫీసులు,చీఫ్ఎక్జామినర్స్,ఎక్జామినర్స్,సహాయక  ఎక్జామినర్స్ ని నియమించి వారికి సూచనలు చేసినట్టు బోర్డు అధికారులు తెలిపారు.
Visit for more updates

www.paatshaalaindia.blogspot.com

0 comments:

Post a Comment