ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి ఆధ్వర్యం లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ - 2019 ను కేంద్ర తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ కి అనారోగ్యం కారణంగా, ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.- ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు
- స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలకు పెంపు
- ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుబడులు పెడితే రూ.6.5 లోపు ఆదాయపు పన్ను మినహాయింపు
- వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్
- 2030 కల్ల ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగంలో భారత్దే అగ్రస్థానం
- రానున్న 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్ధిక వ్యవస్థ
- నల్ల ధనాన్ని అరికట్టేందుకు చేసిన దాడుల్లో 50 వేల కోట్ల రూపాయలు సీజ్ చేశాం
- వచ్చేఆర్థిక సంవత్సరం నుండి 24 గంటల్లోనే ఐటీఆర్ ప్రాసెస్, రిఫండ్
- గతేడాది దాఖలైన రిటర్న్స్లో 94 శాతం యథాతథంగా ఆమోదించారు
- సినిమా నిర్మాణానికి సింగిల్ విండో అనుమతులు
- సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు
- ఎలక్ట్రానిక్ వాహనాలకు దేశంలోనే బ్యాటరీల తయారీ.. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది
- మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.15,166 కోట్లు కేటాయింపు
- ఐదేళ్లలో 34 కోట్ల జన్ధన్ ఖాతాలు ప్రారంభం.
- ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ.12 లక్షల కోట్లు
- 80 శాతం పెరిగిన ట్యాక్స్పేయర్లు
- * పన్ను మినహాయింపు నూ. 50 వేలు పెంపు
- * ఆదాయపు పన్ను పరిమితి రూ. 3 లక్షలకు పెంపు
- * త్వరలో 'వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు' ప్రారంభం
- * ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, వాయిస్ కాల్స్
- * సోలార్ విద్యుదుత్పత్తిలో 10 రెట్ల వృద్ధి
- * ప్రధాన మంత్రి శ్రమ యోగి బంధన్ పేరుతో పింఛన్ పథకం
- * రైల్వే రంగానికి రూ. 64,587 కోట్లు
- * ఆవుల సంరక్షణకు కమిషన్ ఏర్పాటు
- * రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది
- * బ్రాడ్గేజ్లో కాపలా లేని గేట్లను తొలగించాం
- * సాగర్మాల కింద పోర్టుల ద్వారా సరకు రవాణా
- * బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా
- * రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు
- * వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఇప్పటికే రూ.35 వేల కోట్లు చెల్లించాం
- * పీఎం కౌషల్ వికాస్ యోజన కింద కోటిమంది యువతకు శిక్షణ
- * దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు
- * సైనికులకు ప్రత్యేక అలవెన్సులు
- * అంగన్వాడీ సిబ్బంది వేతనం 50 శాతం పెంపు
- * ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోయిన వారి రుణాల రీషెడ్యూలింగ్
- * రీ షెడ్యూల్ చేసిన రుణాలపై 2 శాతం వడ్డీ తగ్గింపు
- * ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం
- * కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు
- * రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రాయితీలు
- * గ్రామీణులకు కొత్తగా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
- * కార్మిక ప్రమాద బీమా రూ.లక్షన్నర నుంచి రూ. 6 లక్షలకు పెంపు
- * *గ్రాట్యుటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు*
- * ముద్ర స్కీం కింద రుణాలకు రూ. 7 లక్షల కోట్లు
- * 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్
- * అసంఘటిత కార్మికులు పెన్షన్ కోసం రూ.60 జమ చేయాల్సి ఉంటుంది
- * ఈఎస్ఐ లిమిట్ను రూ.15 వేల నుంచి 21 వేలకు పెంపు
- * రూ.15 వేల నెల జీతం వుండే వేతన జీవులకు కొత్త పథకం
- * ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరుతో కొత్త స్కీమ్
- * నెలకు రూ. 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది
- * ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75 వేల కోట్లు
- * పాడి, మత్స్య రైతులకు 2 శాతం వడ్డీకే రుణం
- * కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తాం
- * పెన్షన్లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
- * 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి
- * 2018 డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమం అమలు
- * గోకుల్ మిషన్కి రూ. 750 కోట్లు
- * గో ఉత్పాదకత పెంచడం కోసం రాష్ట్రీయ కామ్ధేన్ అయోగ్
- * 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు సాయం
- * ప్రతి ఏడాది రూ. 6000 పెట్టుబడి సాయం
- * చిన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు వెళుతుంది. మూడు ఇన్స్టాల్మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది
- * ఎఫ్డీఐ విధానాన్ని పూర్తిగా సరళీకరించాం
- * బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం
- * రాష్ట్రాలకిచ్చే వాటాను పెంచాం
- * గ్రామాల్లో 95 శాతం పారిశుద్ధ్యం
- * బొగ్గు, స్పెక్ట్రం వేలంలో పారదర్శకతకు ప్రాధాన్యం
- * ఆయుష్మాన్ భారత్తో పేద, మధ్య తరగతికి రూ. 3 వేల కోట్లు ఆదా
- * కొత్తగా 7 ఎయిమ్స్ ఆస్పత్రులు తీసుకొచ్చాం
- * హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.
- * 22 రకాల పంటలకు మద్ధతు ధర పెంచాం
- * అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం
- * ఉపాధి హామీ రూ.60 వేల కోట్లు
- * గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు
- * నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లు నిర్మించాం
- * మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు
- * ఎల్ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లు ఆదా చేశాం
- * రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేశాం
- * బ్యాంకులకు రూ. 2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించాం
- * ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి
- * అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం
- *TPUS వరంగల్ రూరల్*
- * అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం
- * ఆరో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించాం
- * 2018-19కి ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం
- * కరెంట్ అకౌంట్ లోటును 5.6 నుంచి 2.5 శాతానికి తగ్గించాం
- * మా ప్రభుత్వంలో ధరల నడ్డి విరిచాం
- * మా హయాంలో ద్రవ్యోల్బణం దిగివచ్చింది
- * జీడీపీ వృద్ధి రేటులో గణనీయమైన పురోగతి
- * మా ప్రభుత్వం ప్రతీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తోంది
- * గడిచిన ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం
- * మోడీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం.
- * 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నారు
- * విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం
- * దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది.
- * రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే మా లక్ష్యం
- * అందరికీ ఇల్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యం
Friday, 1 February 2019
బడ్జెట్ 2019 ముఖ్యాంశాలు
By . at February 01, 2019
No comments



0 comments:
Post a Comment