Thursday, 14 February 2019

టీఎస్ ఎడ్-సెట్ షెడ్యుల్ ఖారారు:25 న నోటిఫికేషన్




తెలంగాణా ప్రభుత్వం  ఎడ్ సెట్ నోటిఫికేషన్ ను ఈ నెల 25 వ తేదీన విడుదల చేయనుంది.మే 31 న  పరిక్ష నిర్వహిస్తారు.జూన్ 15 న  ఫలితాలు వెల్లడించనుంది.  ఈ నెల 28 నుండి వచ్చే నేల ఏప్రిల్ 10 వరకు  దరఖాస్తులు తీసుకుంటారు.ఆలస్య రుసుము తో మే 4  వరకు  దరఖాస్తు తీస్కుంటారు.  డిగ్రీ పూర్తయిన విద్యార్థులు, టీచర్ కావడానికి ఎలిజిబిలిటీ అయిన బీ ఈడీ కోర్సు రెండు సంవత్సరాల కోర్సు.  తెలుగు,ఇంగ్లీష్ ,బయలాజికల్ సైన్స్ ,ఫిజికల్ సైన్స్ ,మాథ్స్ , సోషల్ స్టడీస్ ల  లో బీ ఈడీ ఉంటుంది. ఈ కోర్సులో చేరడానికి ప్రతీ సంవత్సరం నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. దీనిని ఉస్మానియా యునివర్సిటీ నిర్వహించనుంది.150 మార్కుల పేపర్  ,ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది.ఇందులో 100 మార్కులు సబ్జెక్టు ,మిగతా 50 మార్కులకు గానూ,gk , టీచింగ్ ఆప్టిట్యూడ్ ,ఇంగ్లీష్ లు ఉంటాయి.

0 comments:

Post a Comment