Thursday, 1 September 2016

గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్: గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 1032 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతంలో 439 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇప్పుడు 593 పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. మునిసిపల్‌ కమిషనర్‌(గ్రేడ్‌3)-19, సబ్ రిజిస్ట్రార్‌(గ్రేడ్‌2)- 23, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్‌ ఆఫీసర్‌-156, ఎక్సైజ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌-284, డిప్యూటీ తహసీల్దార్‌-259, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (రిజిస్ట్రార్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌)‌-62, విస్తరణ అధికారి (పంచాయతీరాజ్‌ అండ్ రూరల్‌ డెవలప్‌మెంట్‌)-67, ఈవో-గ్రేడ్‌1 (దేవాదాయశాఖ)-11, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌-03, అసిస్టెంట్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (హ్యాండ్‌లూమ్స్‌ & టెక్స్‌టైల్స్)-20, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ (జీఏడీ)- 90, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ (ఆర్థికశాఖ)- 28, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ (న్యాయశాఖ)- 10 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

0 comments:

Post a Comment