తెలంగాణ లో ఇంటర్ ఫలితాల పై నెలకొన్న సందిగ్ధం తొలగి పోయింది.ఫలితాల పై వివిధ రకాల తేదీల ని నెట్ లో , సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడం తో ,విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు.ఈ నేపథ్యం లో ఇంటర్ బోర్డు ఈ నెల 18 వ తేదీన ప్రకటించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.దీంతో ఇంటర్ ఫలితాలపై ఊహాగానాలకు తెర పడింది.రాష్ట్రంలో సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఫలితాల కోసం
www.bie.gov.in సైట్ ను సందర్శించండి.





0 comments:
Post a Comment