Saturday, 23 March 2019

డిగ్రీ మరియు యూనివర్సిటీ అధ్యాపకుల 7 వ వేతన సవరణ దస్త్రం పై సీఎం సంతకం:త్వరలోనే G. O విడుదల




సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న 7 వ వేతన సవరణ ఫైలు పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సంతకం చేశారు. తెలంగాణా లో పనిచేస్తున్న యూనివర్సిటీ మరియుప్రభుత్వ డిగ్రీ కలాశాల ,మరియు ఎయిడెడ్ డిగ్రీ అధ్యాపకుల 7 వ  వేతన సవరణ కు సంబంధించిన ఈ ఫైల్ పై సీఎం సంతకం చేయడం తో ,ఉన్నత విద్యా శాఖకు చెందిన అధ్యాపకులకు 2016 జనవరి 1 వ తేదీ నుండి ఈ వేతనాలు పెరుగుతాయి.2016 జనవరి నుండి ఇప్పటి వరకు వచ్చే బకాయిలు GPF ఉద్యోగులకు GPF ఖాతాల్లోకి ,CPS ఉద్యోగులకు బకాయిలలో 90 శాతం నగదు,10 శాతం CPS ఖాతల్లోకి జమా చేస్తారు.ఈ పెంపుకు సంబంధించి వారం రోజు ల్లో  G.O.  మరియు CCE నుండి ప్రొసీడింగ్స్  విడుదల అవుతుందని సమాచారం.అయితే దీనికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంది.

0 comments:

Post a Comment