Saturday, 19 January 2019

ఏపీ లో రేపటి నుండి SI అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, SI ఉద్యోగ దేహ దారుడ్య పరీక్షలు 21 వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌ తెలిపారు. గత ఏడాది నవంబరు 1న విడుదల చేసిన ఎస్‌ఐ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాథమిక ప్రవేశ పరీక్షలో 51,926 మంది అర్హత సాధించారని చెప్పారు. వీరిలో.. 12,703 మంది ఉత్తరాంధ్ర ప్రాంత అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 4వరకు విశాఖపట్నంలో, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 12,868 మందికి ఏలూరులో ఫిబ్రవరి 5వరకు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 9,434 మందికి ఫిబ్రవరి 1వరకు, రాయలసీమ అభ్యర్థులు 16,921 మందికి కర్నూలులో ఫిబ్రవరి 9వరకు ఫిట్‌నెస్‌, మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని విశ్వజీత్‌ వివరించారు.

0 comments:

Post a Comment