Saturday, 20 August 2016

RBI నూతన గవర్నర్ గా ఉర్జిత్ పటేల్.


Urjit Patel. File photo.

ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌‌గా కొనసాగుతున్న ఊర్జిత్ పటేల్‌ను ప్రభుత్వం గవర్నర్‌గా ప్రకటించింది. ఈ విషయంలో తుదికంటా పలువురి పేర్లు వినిపించినా చివరికి ఊర్జిత్‌కే ఆ అవకాశం దక్కింది. ఇక గవర్నర్ పదవి నుంచి రాజన్ తప్పుకుంటున్నట్టు ప్రకటించినప్పటి నుంచి పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అర్వింద్ సుబ్రమణియన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగారియా, మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాకేశ్ మోహన్, ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఎకనమిక్స్ అపైర్స్ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తదితరులు పేర్లు విస్తృత ప్రచారం పొందాయి. తాజాగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్న్ పేరుకూడా తెరపైకి వచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊర్జిత్ పటేల్ పేరును ప్రకటించి ఊహాగానాలకు తెరదించింది.

0 comments:

Post a Comment